ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ఉద్ధవుని మందకుఁ బుచ్చుట
తనరార మన్నించి తగఁ గౌఁగిలించి
కొని బుజ్జగించి మ్రొక్కుచు సిరిపలికె.
“ఏపార వ్రేపల్లెకేఁగి యానంద
గోపయశోదలఁ గొమరారఁ గాంచి
మక్కువ వారి సేమములెల్ల నడిగి
మ్రొక్కితినను, నేము మొగి తమ్ముఁ జూడ - 330
వచ్చెదమను, వేగ వసుదేవు దొంటి
యిచ్చటి చుట్టాలు యేమును గలసి
యున్నారమను, మమ్మునుగ్రసేనుండు
మన్నించునని చెప్పు, మందలోఁ గల్గు
గోపాలకులనెల్లఁ గోరి వేర్వేర
నేపార నక్కుననిడినంటి ననుము;
ననుఁ బాసి మదనబాణములలో దారి
ఘనమైన విరహాగ్నిఁ గ్రాఁగుచునున్న
వల్లవ సతుల నెవ్వగలెల్లఁ తీర్ప
నెట్లుటిలోననే నేతెంతుననుము
పొ”మ్మన్న నయ్యదు పుంగవుఁ డెలమి
క్రమ్మర రథమెక్కి కదలి మాపటికిఁ
గరమొప్ప రవికన్యకాతీరభూమి
బొరి గిన్నరేశునిపురి గ్రేణిసేసి
సకలసంపదలకు సదనమైపొలుచు
నకలంకగతి మందకరిగె నుద్ధవుఁడు
తనరాక నెరిఁగింపఁ దగ నందుఁ డెదురు